పుల్వామాలో ఎన్‌కౌంటర్‌..

by సూర్య | Fri, Apr 02, 2021, 08:15 AM

 దక్షిణా కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. పుల్వామాలోని ఘాట్ మొహల్లా కాకపోరా ప్రాంతంలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ మేరకు అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. సైన్యంతో పాటు సీఆర్‌ఎఫ్‌, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకోగా.. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM