by సూర్య | Thu, Apr 01, 2021, 12:08 PM
తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో గురువారం రెండు నాటు బాంబులు బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, పంది మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అడవి పందుల కోసం ఈ నాటు బాంబులను పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Latest News