ఐపీఎల్ అభిమానులకు వరుస షాకులు!

by సూర్య | Thu, Apr 01, 2021, 12:01 PM

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి చెన్నై టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడటం లేదని హేజిల్‌వుడ్ స్పష్టం చేశాడు. దీంతో సీఎస్‌కే కొత్త బౌలర్ కోసం వెతుకుతోంది. కాగా సన్ రైజర్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ నుండి తప్పుకోగా తాజాగా జోష్ హేజిల్‌వుడ్ అదే బాట పట్టారు. ఐపిఎల్ 2020 వేలంలో హాజల్‌వుడ్‌ను చెన్నై యాజమాన్యం 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా గత సీజన్ లో అతను 3 మ్యాచులు ఆడి ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ 14 నుంచి జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్ మొత్తం ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు దూరమయ్యారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM