by సూర్య | Thu, Apr 01, 2021, 09:24 AM
చిత్తూరు: యాదమరి మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. యాదమరి మండలంలోని బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్ (45)పై ఏనుగులు దాడి చేశాయి. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై గుంపుగా వచ్చిన ఏనుగులు దాడి చేయడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి..విచారణ చేపట్టారు.
Latest News