by సూర్య | Wed, Mar 31, 2021, 05:29 PM
ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంలో ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. నేరాలని అరికట్టే ఉద్దేశ్యంలో భాగంగా రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ లు మార్చి 31 నుండి చెల్లవని గతంలో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువు పెంపుతో వినియోగదారులకు ఊరట కలగనుంది.
Latest News