మాజీ ప్రధాని దేవేగౌడకు కరోనా పాజిటివ్‌

by సూర్య | Wed, Mar 31, 2021, 03:00 PM

బెంగళూరు : మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మహమ్మారి బారినపడడంతో కుటుంబ సభ్యులంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తమను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడొద్దని సూచించారు. మాజీ ప్రధానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వైద్యులను సంప్రదించి, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఆయన, చెన్నమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Latest News

 
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు, పథకాల పూర్తి వివరాలు Sat, Apr 27, 2024, 07:49 PM
పిఠాపురం నియోజకవర్గానికి రౌడీతత్వాన్ని అంతకడుతున్నారు Sat, Apr 27, 2024, 07:47 PM
రాష్ట్రంలో దొంగలు పడ్డారు, కర్రలు చేతపట్టి రండి Sat, Apr 27, 2024, 07:46 PM
మేనిఫెస్టో లో విశాఖను క్యాపిటల్ టౌన్‌గా ప్రకటించడం సంతోషం Sat, Apr 27, 2024, 07:46 PM
ఏపీలో పక్కాగా ఆయనే గెలుస్తాడు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Apr 27, 2024, 07:45 PM