by సూర్య | Wed, Mar 31, 2021, 02:38 PM
అమెజాన్ మరో బంపరాఫర్తో ముందుకొచ్చింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. అయితే, ఈ ఆఫర్ను కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబధించి ఎస్బీఐతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్, శామ్సంగ్, రెడ్మీ, వన్ప్లస్, ఒప్పో, వివో, ఎల్జీ, నోకియా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లను 40 శాతం వరకు డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు.
ఎస్బీఐ కస్టమర్లు వీటికి అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఒకవేళ, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మొబైల్ కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే, మీరు ఈ డిస్కౌంట్ను పొందడానికి కనీసం రూ .5 వేల లావాదేవీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుకు గరిష్ట తగ్గింపు కింద రూ .1,000 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుందని గుర్తించుకోవాలి. ఈ ఆఫర్ను పొందడానికి ఎస్బీఐ కస్టమర్లు ముందుగా ఎస్బీఐ యోనో యాప్లోకి లాగిన్ అయి “బెస్ట్ ఆఫర్స్” సెక్షన్లోకి వెళ్లాలి. అందులో అమెజాన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకొని అమెజాన్ సైట్లో మీ మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లో భాగంగా ఎస్బీఐ కస్టమర్లకు అమెజాన్ ప్రత్యేకంగా నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను కూడా అందిస్తోంది.
Latest News