ఎస్​బీఐ కస్టమర్లకు బంపరాఫర్..

by సూర్య | Wed, Mar 31, 2021, 02:38 PM

అమెజాన్​ మరో బంపరాఫర్​తో ముందుకొచ్చింది. ప్రముఖ మొబైల్‌ బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​ అందజేస్తుంది. అయితే, ఈ ఆఫర్​ను కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబధించి ఎస్​బీఐతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆఫర్​లో భాగంగా ఐఫోన్, శామ్‌సంగ్, రెడ్‌మీ, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఎల్‌జీ, నోకియా వంటి ప్రముఖ​ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లను 40 శాతం వరకు డిస్కౌంట్​తో కొనుగోలు చేయవచ్చు. 


ఎస్​బీఐ కస్టమర్లు వీటికి అదనంగా 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఒకవేళ, ఎస్​బీఐ క్రెడిట్ కార్డుతో మొబైల్​ కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే, మీరు ఈ డిస్కౌంట్​ను పొందడానికి కనీసం రూ .5 వేల లావాదేవీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుకు గరిష్ట తగ్గింపు కింద రూ .1,000 డిస్కౌంట్​ మాత్రమే లభిస్తుందని గుర్తించుకోవాలి. ఈ ఆఫర్​ను పొందడానికి ఎస్​బీఐ కస్టమర్లు ముందుగా ఎస్​బీఐ యోనో యాప్​లోకి లాగిన్ అయి “బెస్ట్ ఆఫర్స్” సెక్షన్​లోకి వెళ్లాలి. అందులో అమెజాన్​ ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకొని అమెజాన్​ సైట్​లో మీ మొబైల్​ కొనుగోలు చేయవచ్చు.​ ఆఫర్​లో భాగంగా ఎస్​బీఐ కస్టమర్లకు అమెజాన్​ ప్రత్యేకంగా నోకాస్ట్​ ఈఎంఐ ఆప్షన్​ను కూడా అందిస్తోంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM