by సూర్య | Wed, Mar 31, 2021, 03:27 PM
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి టైంస్లాట్ టోకెన్లు 15,000 మాత్రమే జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అన్ని రకాల దర్శనాల్లో కేవలం 45,000 మందికే శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల వచ్చే ప్రతి భక్తుడు మాస్క్ ధరించాలని, స్వామి వారిని దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించనున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే భక్తులు తిరుమలకు రావొద్దని కోరారు. కరోనా కేసులు ఇంకా ఎక్కువైతే శ్రీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేసి వాటిని మే, జూన్ కు రీషెడ్యూల్ చేస్తామన్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి అరగంట ముందు మాత్రమే అనుమతిస్తామని, భక్తులు గమనించాలని అధికారులు కోరారు.
Latest News