by సూర్య | Wed, Mar 31, 2021, 02:33 PM
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ సిటీల్లో నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 15 వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తారు. ఈనెల 31వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి ఉండగా, దానిని పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
Latest News