by సూర్య | Wed, Mar 31, 2021, 01:46 PM
కేవలం ఎనిమిది రాష్ట్రాలతోనే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కోవిడ్ కొత్త కేసులు వస్తున్నాయని తెలిపింది. ఏకంగా 84 శాతం కొత్త కేసులు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని, మిగతా రాష్ట్రాల నుంచి తక్కువ సంఖ్యలోనే కొత్త కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజలు కూడా ఈ ఎనిమిది రాష్ట్రాలలో కరోనా వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
Latest News