by సూర్య | Wed, Mar 31, 2021, 01:50 PM
వైఎస్సార్ బీమా లబ్ధిదారులకు ఏపీ సీఎం జగన్ బుధవారం ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఇంటిపెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తం రూ.254 కోట్లు బదిలీ చేశారు. సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు(18-50 వయస్సు), రూ.3లక్షల బీమా (51-70 వయస్సు), అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమా అందించనున్నారు.
Latest News