ఇయర్ ఫోన్స్ వాడేవారికి అలర్ట్..

by సూర్య | Wed, Mar 31, 2021, 01:10 PM

కొవిడ్ 19 టైమ్‌లో ఎక్కువ మంది ఇంటి నుండే పని చేస్తున్నారు. పిల్లలు కూడా ఇంట్లో నుండే ఆన్లైన్ లో క్లాసులు వింటున్నారు. ఈ పనులు చేయాలంటే ఇయర్ ఫోన్స్ వాడకం తప్పని సరి. కానీ ఈ ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైతే చెవిలో పోటు, ఇరిటేషన్, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడెనిమిది నెలలుగా ఇలాంటి సమస్యలు ఎక్కువ కావడానికి కారణం హెడ్ ఫోన్స్, ఇయర్ పాడ్స్ ఎక్కువగా వాడడమే అని డాక్టర్లు అంటున్నారు. ఈ కంప్లైంట్స్ అన్నింటికీ కారణం ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ ఎక్కువ వాల్యూం లో యూజ్ చేయడమే అని డాక్టర్ల అభిప్రాయం. ఈ కంప్లైంట్స్ తో హాస్పిటల్ కి వస్తున్న వారిలో ఎక్కువ మంది రోజుకి ఎనిమిది గంటల పైగా హెడ్ ఫోస్న్ ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఇందు వల్ల చెవుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. స్టెరిలైజ్ చేయని ఇయర్ పాడ్స్, ఇయర్ ప్లగ్స్ వల్ల ఇన్‌ఫెక్షన్ ఈజీగా వ్యాపిస్తుంది. ఎక్కువ సేపు ఎక్కువ వాల్యూం లో వినడం వినికిడి శక్తి మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఈ అలవాటు మార్చుకోకపోతే మాత్రం చెవులకి శాశ్వతమైన నష్టం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.


చెవిలో ఉండే వ్యాక్స్ బ్యాక్టీరియాని నశింపచేసి చెవి లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కాటన్ బడ్స్ యూజ్ చేసి చెవులు క్లీన్ చేయడం వల్ల ఈ వ్యాక్స్ రిమూవ్ చేయబడుతుంది. ఫలితం గా చెవి లోపలి భాగం బ్యాక్టీర్యాకి ఎక్స్పోజ్ అవుతుంది. తద్వారా చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్స్ ని ఎవాయిడ్ చేయడానికి ఒక్కటే మార్గం - అప్పుడప్పుడూ ఇయర్ ఫోన్స్ రిమూవ్ చేయడం. అప్పుడే బయట గాలి చెవి లోపలికి వెళ్ళగలుగుతుంది. అలా జరిగితేనే చెవులు సేఫ్ గా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చెవికి సంబంధించిన సమస్యలు కేవలం ఇంటి నుండి పని చేస్తున్న ప్రొఫెషనల్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఆన్లైన్ లో క్లాసులకి అటెండ్ అవుతున్న స్కూల్ పిల్లలు కూడా ఇవే సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అసలు ఆ వయసులో ఉన్న పిల్లలు హెడ్ ఫోన్స్ ఉపయోగించకూడదనీ, లాప్‌టాప్, లేదా పర్సనల్ కంప్యూటర్ ద్వారా క్లాసులు వినే పిల్లలకి ఆ డివైస్ వాల్యూం సరిపోతుందనీ నిపుణుల అభిప్రాయం. ఇలా హెడ్ ఫోన్స్ తో వినే అలవాటు పెరిగిపోతే, రెగ్యులర్ స్కూల్ మొదలయిన తరువాత చాలా మంది పిల్లలకి వినికిడి సమస్యలు వస్తాయని వారు భయపడుతున్నారు.


ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాంఫరెన్సెస్ లో మాట్లాడేవాళ్ళకి కొన్ని విషయాలు తెలియవనీ, వాల్యూం పెద్దగా పెట్టి మాట్లాడతారనీ డాక్టర్లు చెబుతున్నారు. స్కూల్ కి వెళ్ళే వయసులో ఉన్న పిల్లలు అరవై డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ తో హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే వారి వినికిడి శక్తి మీద అది ఒత్తిడిని కలుగ చేస్తునదని కూడా వారు చెబుతున్నారు. పిల్లలు ఏ వాల్యూం లో క్లాసులు వింటున్నారో తల్లిదండ్రులు గమనించుకోవాలనీ, హై వాల్యూమ్ లో కనుక వినే అలవాటు వివిధ రకాల కాంప్లికేషన్స్ కి దారి తీయగలదనీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. హై వాల్యూమ్ లో ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల చెవిలో ఇరిటేషన్ పెరిగిపోతుంది, అంతే కాక ఎక్కువ సేపు ఎక్కువ సౌండ్ తో వింటే చిరాకు, విసుగు, కోపం వంటి సమస్యలు తలెత్తుతాయనీ, ఆందోళన కూడా ఎక్కువవుతుందనీ కూడా వారు చెబుతున్నారు.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM