యూపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన

by సూర్య | Wed, Mar 31, 2021, 12:45 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏప్రిల్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


-అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్) విభాగంలో 14 పోస్టులు ఉన్నాయి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ): 2 పోస్టులు ఉన్నాయి
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ): 11 పోస్టులు ఉన్నాయి
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ): 1 పోస్ట్ ఉంది.
-అయితే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులు రూ. 25ను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి ఈ ఫీజును చెల్లించే అవకాశాన్ని కల్పించారు.
-ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM