by సూర్య | Wed, Mar 31, 2021, 12:03 PM
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2021 లీగ్ లో పాల్గొనేందుకు ఆయన స్వదేశం నుండి బయలుదేరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సీజన్ తొలి విడత మ్యాచ్ లకు వార్నర్ దూరం అవుతాడన్న ఊహాగానాలతో హైదరాబాద్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇంతలో తాను వస్తున్నట్లుగా వార్నర్ ప్రకటించడంతో వార్నర్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లీగ్ కు బయలుదేరేముందు వార్నర్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 11న సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.
Latest News