by సూర్య | Wed, Mar 31, 2021, 11:58 AM
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ సిటీల్లో నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 15 వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తారు. ఈనెల 31వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి ఉండగా, దానిని పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఈనెల 30న కొత్తగా 2,200 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,338కి చేరింది. మరో ఇద్దరు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 4,510కి చేరింది. తాజా గణాంకాల ప్రకారం 2,88,565 మంది కోవిడ్ పేషెంట్లకు స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుం 12,263 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇంతవరకూ 53,89,349 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగా, ఇందులో 6,43,855 మంది వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
Latest News