by సూర్య | Wed, Mar 31, 2021, 12:07 PM
రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం రెండోదశ కింద 16, 345 ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ. 4, 446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
2021–22 విద్యా సంవత్స రంలో 10 కాంపొనెంట్ల కింద ఈ మౌలిక వసతు లను కల్పిస్తారు. మొదటిదశ కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15, 715 పాఠశాలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రెండోదశలో చేపట్టే పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
Latest News