by సూర్య | Wed, Mar 31, 2021, 11:46 AM
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ఇటీవల పాకిస్థాన్ డే సందర్భంగా తమకు ధన్యవాదాలు తెలుపుతూ మోడీ రాసిన లేఖకు రిప్లై ఇచ్చారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ డే సందర్బంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలపుతున్నామని లేఖలో ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కీలక అంశాలను ప్రస్తావించారు. భారత్ సహా పొలుగు దేశాలన్నింటితో పాక్ ప్రజలు శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటారని తెలిపారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలు, ముఖ్యంగా కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని చెప్పారు.
Latest News