by సూర్య | Wed, Mar 31, 2021, 11:40 AM
అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద ఏపీ సీఎం జగన్ బుధవారం ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారికి కూడా బీమా సొమ్మును చెల్లించనున్నారు. ఈ మేరకు 2020 అక్టోబర్ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ.254 కోట్లు చెల్లించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
Latest News