చనిపోయాడకున్నారు.. 3 నెలల తర్వాత తిరిగొచ్చాడు!

by సూర్య | Tue, Mar 30, 2021, 04:37 PM

చనిపోయాడనుకుని అంత్యక్రియలు నిర్వహించిన 3 నెలలకు ఆ వ్యక్తి తిరిగొచ్చి కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కుదస్సనాడులో చోటుచేసుకుంది. సాబూ అనే వ్యక్తి క్యాటరింగ్, బస్‌ క్లీనింగ్‌ వంటి ఉద్యోగాలు చేస్తూ.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఓసారి తను పనిచేసే హోటల్‌ లో డబ్బు చోరీ జరిగింది. ఆ కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబర్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు.


ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ 24న కొట్టాయం జిల్లా పాలా పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. తిరువనంతపురం పోలీసులు ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సాబూ కావచ్చనే అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఒక బస్‌ డ్రైవర్‌ కు సాబూ కనిపించాడు. వెంటనే అతడు ఈ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఇప్పుడు పోలీసులు..గత డిసెంబర్‌ లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM