by సూర్య | Sat, Mar 27, 2021, 01:17 PM
దేశ వ్యాప్తంగా సీబీఐ చేపట్టిన స్పెషల్ రైడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 11 రాష్ట్రాల్లోని 100 ప్రదేశాల్లో ఏక కాలంలో రైడ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుండి 3 వేల 700 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై ఈ దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. కాగా ఏపీలోని గుంటూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలోనూ సీబీఐ బృందాలు దాడుల నిర్వహించf కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
Latest News