by సూర్య | Sat, Mar 27, 2021, 01:22 PM
ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు సిరాను ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్ల ఎడమ చేతికి సిరాను పెట్టారు. అది ఇంకా తొలగిపోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తిరుపతి ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో ఉన్నారు.
Latest News