by సూర్య | Sat, Mar 27, 2021, 01:03 PM
కరోనా సెకండ్ వేవ్ భారత్ లో టెన్షన్ పెట్టిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసులు పలు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హోలీ పండగ వేడుకలపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హోలీ వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. హోలీ పండగ పేరుతో జనాలు గుమికూడరాదు అని ప్రకటించాయి.
Latest News