ఈజిప్టులో ఢీకొన్న రెండు రైళ్లు

by సూర్య | Sat, Mar 27, 2021, 09:52 AM

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులోని సోహగ్‌ ప్రావిన్స్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 36 మంది మరణించగా..66 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు భోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి డజనుకు పైగా అంబులెన్స్‌ పంపామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక మీడియాలో ప్రచురితమైన ప్రమాద వీడియోలు ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్నాయి. మూడు భోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ప్రయాణీకులు తీవ్రంగా రక్తమోడుతున్నారు.

Latest News

 
కుప్పంలో పరిస్థితేంటి..? చంద్రబాబు కంచుకోటలో వైసీపీ జెండా ఎగురుతుందా..? Thu, May 02, 2024, 07:22 PM
మరో పది రోజుల్లో ఎన్నికల పోలింగ్.. ఈసీకీ టీడీపీ లేఖ Thu, May 02, 2024, 07:19 PM
8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు Thu, May 02, 2024, 07:15 PM
సీఎం సొంత జిల్లాలో.. వైసీపీ ఎమ్మెల్యేపై బావమరిది పోటీ Thu, May 02, 2024, 07:12 PM
వైసీపీ నవరత్నాలకు పోటీగా కే.ఏ. పాల్ దశరత్నాలు Thu, May 02, 2024, 07:08 PM