by సూర్య | Sat, Mar 27, 2021, 09:52 AM
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 36 మంది మరణించగా..66 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు భోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి డజనుకు పైగా అంబులెన్స్ పంపామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక మీడియాలో ప్రచురితమైన ప్రమాద వీడియోలు ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్నాయి. మూడు భోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ప్రయాణీకులు తీవ్రంగా రక్తమోడుతున్నారు.
Latest News