by సూర్య | Thu, Mar 25, 2021, 05:22 PM
ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు జ్యోతిని తరలించడం సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అయితే ప్రతిసారి ఒలింపిక్ జ్యోతి రిలే నామమాత్రంగా సైడ్ షో కోసం నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరి దృష్టి టార్చ్ రిలేపైనే ఉంది. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, పరిమిత ప్రేక్షకుల మధ్య గురువారం నాడు ఈశాన్య జపాన్ లో అధికారికంగా ఒలింపిక్ టార్చ్ రిలేను ప్రారంభించారు. ఫుకుషిమాలోని జెవిలేజ్ స్టోర్స్ కాంప్లెక్స్ లో ఈ రిలే ఆరంభమైంది. కరోనా కారణంగా చీర్ గాల్స్ లాంటి ఇతర ఏర్పాట్లు ఈ సారి నిషేధించారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండానే ఈ సారి ఒలింపిక్ రిలే ప్రారంభమైంది.
Latest News