by సూర్య | Thu, Mar 25, 2021, 03:07 PM
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య చేతులు నరికేశాడు. దీంతో బాధితురాలిని భోపాల్ లోని హమిదియ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. రణ్ధీర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 15 రోజులకే అతడు తన భార్యను అనుమానించడం మొదలెట్టాడు. ఆమె ఎవరితో మాట్లాడినా అభ్యంతరం చెప్పేవాడు. ఈ క్రమంలో సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో భార్యను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లిన రణధీర్.. మార్గమధ్యంలో గొడ్డలితో తన భార్య చేతులను నరికి పారిపోయాడు.
తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం ఆమెను తన మామ చూసుకుంటున్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.
Latest News