by సూర్య | Thu, Mar 25, 2021, 03:56 PM
కేరళ తీరంలో తీవ్ర కలకలం రేగింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్లోకి డ్రగ్స్ను తరలిస్తున్న ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. వారిని నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లోర రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్చి 18న ఈ ఘటన జరగగా దానికి సంబంధించిన వివరాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు.
Latest News