by సూర్య | Thu, Mar 25, 2021, 02:14 PM
క్రికెట్ అభిమానులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివర్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ జరుగుతుందని పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే దీనిపై పీసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు ఇంకా జరగలేదని, ఒకవేళ ఈ సిరీస్ అనుకున్నట్లుగా జరిగితే భారత జట్టు పాకిస్థాన్ కు రావాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు దేశాల మధ్య చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాకిస్థాన్ జట్టు ఇండియాకు వచ్చింది. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య 2012-13లో సిరీస్ జరిగింది.
Latest News