by సూర్య | Thu, Mar 25, 2021, 12:19 PM
తిరుమల ఘాట్రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Latest News