by సూర్య | Thu, Mar 25, 2021, 12:03 PM
ఐసీసీ ర్యాంకింగ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హావా కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ 3 ర్యాంకులు మెరుగై 14వ స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాడ్ తో ఆడిన మ్యాచ్ లలో విఫలమైన కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకుకు చేరుకున్నారు. టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 26కు చేరుకున్నాడు. అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ కింద నుంచి 66, రిషభ్ పంత్ 69,పేసర్ భువనేశ్వర్ కుమార్ 24, హార్దిక్ పాండ్య 78, శిఖర్ ధావన్ 15వ స్థానాలు దక్కించుకున్నారు.
Latest News