by సూర్య | Thu, Mar 25, 2021, 11:59 AM
మంగళగిరి పట్టణంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జేబు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం ఓ మహిళ మంగళగిరి పట్టణంలోని మెయిన్ బజార్ మీదుగా వెళ్తున్న సమయంలో దొంగల ముఠా సభ్యులు వలపన్ని సదరు మహిళ బ్యాగు లోని పర్సును చాకచక్యంగా తస్కరించారు. మెయిన్ బజార్ పూలమార్కెట్ సెంటర్ వద్దకి వచ్చిన తరువాత గుర్తించిన మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు పిక్ పాకెటర్లని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం మంగళగిరి పట్టణ పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం 8 మంది సభ్యులని అదుపులోకి తీసుకుని మహిళ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు..
మంగళగిరి పట్టణంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా పోలీస్ లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు మంగళగిరి కి చేరుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి జేబుదొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో, మెయిన్ బజార్ లో అనుమానితులపై నిఘా వేయాల్సి ఉంది.
Latest News