by సూర్య | Thu, Mar 25, 2021, 11:56 AM
భారత్ లో గత 24 గంటల్లో 53,476 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 251 మంది మరణించగా 26,490 మంది కరోనాతో కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 1,17,87,534 కరోనా కేసులు నమోదు కాగా 1,12,31,650 మంది కోలుకున్నారు. 1,60,692 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 3,95,192 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో కొత్తగా నమోదైన కేసులో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే 31,855 మందికి కరోనా సోకింది.
Latest News