by సూర్య | Thu, Mar 25, 2021, 11:44 AM
పశ్చిమ బెంగార్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా నెలకొంది. ఇరు పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆమె ప్రకటించారు. రాజకీయాల్లో డబ్బు సాధారణమైపోయిన ఈ రోజుల్లో మమత వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
Latest News