by సూర్య | Wed, Mar 24, 2021, 05:48 PM
ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. సెకెండ్ వేవ్ మొదలైందనే అనుమానం పెరుగుతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి గ్రామ సచివాలయ్యాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రను కరోనా వైరస్ భయపెడుతోంది. ఊహించని స్థాయిలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. ప్రజలు మాత్రం సెకెండ్ వేవ్ మొదలైందని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కొందరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా అధికారులు రూపొందిస్తున్నారు.
Latest News