by సూర్య | Wed, Mar 24, 2021, 05:46 PM
మహారాష్ట్రను కరోనా వైరస్ మళ్లీ వణికిస్తోంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా నాందేడ్ జిల్లాలో లాక్డౌన్ విధించింది. నాందేడ్ జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు బుధవారం (మార్చి 24) వెల్లడించారు. ఏప్రిల్ 4 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే బీడ్ జిల్లాలోనూ పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
Latest News