by సూర్య | Wed, Mar 24, 2021, 05:39 PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాలుగు వారాల్లో కోటిమందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలన్నారు. ఎన్నికలు పూర్తైనందున సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో వారానికి నాలుగు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.
Latest News