by సూర్య | Wed, Mar 24, 2021, 01:16 PM
సోషల్ మీడియాలో చేసే వింత వింత పనులకు నెటిజన్ల నుంటి తెగ కామెంట్లు వస్తుంటాయి. అలా వెరైటీ పనులు చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో ఫాపులర్ అవుతుంటారు. అయితే వారు చేసే కొన్ని పనులు వారి ప్రాణాలమీదకే తెచ్చిన ఘటనలో ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ టిక్ టాక్ స్టార్, మహిళా టూరిస్ట్ కు ఊహించని పరిణామం ఎదురైంది. కైలిన్ మేరీ అనే మహిళ బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లారు. క్కడి బీచ్లో గోధుమరంగు శరీరం, గుండ్రటి మచ్చలతో అందంగా కనిపించిన చిన్న అక్టోపస్ ఆమెను ఆకర్షించింది. చూడటానికి అందంగా ఉన్న ఆ ఆక్టోపస్ కనిపించగానే ఆవిడ దాన్ని చేతులోకి తీసుకుని మురిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆతరువాత విషయం అసలు విషయం తెలుసుకున్న ఆమె నివ్వెరపోయింది. ఆమె చేతులోకి తీసుకున్న ఆక్టోపస్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అట. కేవలం 12 నుండి 20 సెం.మీటర్ల పరిమాణంతో ఉండే ఈ జీవులు 26 మందిని నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని ఆమె నెటిజన్లతో పంచుకున్నాయి.
Latest News