by సూర్య | Wed, Mar 24, 2021, 01:08 PM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తెలుగు వ్యక్తి అయిన ఎన్వీ రమణ సుప్రీం కోర్టు సీజేగా బాధ్యతలు తీసుకోబోతుండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని చెప్పొచ్చు.
Latest News