by సూర్య | Wed, Mar 24, 2021, 12:57 PM
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కేసులు, హైకోర్టు తీర్పు, కోడ్ వంటి అంశాలతో ఎన్నికలకు పోలేం అని, పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేమన్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ ఉన్నందున సమయం చాలదని, తదుపరి ఎస్ఈసీ నేతృత్వంలోనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
Latest News