తొలి వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..

by సూర్య | Tue, Mar 23, 2021, 02:37 PM

భారత్‌తో పుణె వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ని 3-2తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. ఈ వన్డే సిరీస్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ టీమ్ కనీసం ఈ వన్డే సిరీస్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది.


ఈ మ్యాచ్‌తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుందని పిచ్ రిపోర్ట్ సందర్భంగా అజిత్ అగార్కర్ చెప్పాడు. కోహ్లి చెప్పినట్లే ఈ మ్యాచ్‌లో రోహిత్‌, ధావనే ఓపెనింగ్ చేయనున్నారు. రాహుల్‌, అయ్యర్‌, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌, భువనేశ్వర్‌, కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.


భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ, శ్రేయా్‌స/సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, సుందర్‌, భువనేశ్వర్‌, శార్దూల్‌, నటరాజన్‌, చాహల్‌.


ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మోర్గాన్‌ (కెప్టెన్‌), బట్లర్‌, బిల్లింగ్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, వుడ్‌, రషీద్‌, టోప్లే.

Latest News

 
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం Mon, May 06, 2024, 10:43 AM
టిడిపిలో చేరిన బండివారిపల్లె గ్రామస్తులు Mon, May 06, 2024, 10:38 AM
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM