by సూర్య | Tue, Mar 23, 2021, 02:43 PM
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సర్కార్ అధికారులకు సూచించింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శ్రీశైలంలోని వేద పాఠశాలలో తాజాగా మరో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఐదు రోజుల క్రితం ఇదే పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురికి కరోనా సోకడంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక స్కూల్స్, కాలేజీల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
Latest News