by సూర్య | Tue, Mar 23, 2021, 02:36 PM
గుంటూరు: దేశంలోనే మొదటిసారి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వండం ఏపీలోనే జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. మంగళవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందని.. దీనికి నిదర్శనం పోలీసు వ్యవస్థకు వచ్చిన అవార్డులేనని చెప్పారు. మహిళల భధ్రతపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్నా పోలీసు భవనాలను నాడు నేడు స్ఫూర్తితో పున:నిర్మించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మహిళ పోలీసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు దాతల సహకారంతో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు స్టేషన్లకు ఐఎస్ఓ మార్క్ అరుదుగా వస్తుందని చెప్పారు. నెల్లూరులోని ఒక పోలీసు స్టేషన్కు, ఐదు దిశ పోలీసు స్టేషన్లకు ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.
Latest News