పరిషత్ ఎన్నికల పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు

by సూర్య | Tue, Mar 23, 2021, 02:01 PM

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది.. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని.. ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కు వాయిదా వేసింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM