'నాడు - నేడు' కార్యక్రమంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

by సూర్య | Tue, Mar 23, 2021, 02:21 PM

నాడు - నేడు కార్యక్రమం చాలా మంచి అనుభూతినిస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పోలీస్‌శాఖలో కూడా నాడు - నేడు ద్వారా పోలీస్ స్టేషన్లను ఆధునీకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగానే ఇలాంటి మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. 1025 నేషనల్ అవార్డు, రివార్డులను ఏపీ పోలీసులు తీసుకోవడం జరిగిందన్నారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాల ముందున్నారని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయన్నారు. కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి ఏపీ పోలీసులు సేవలు అందించారని గుర్తు చేశారు. మహిళా హోం మంత్రి ఆధ్వర్యంలో మహిళా సేఫ్టీకి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM