by సూర్య | Thu, Jan 21, 2021, 09:18 AM
కోల్కతా: ఎన్నికలు సమీపిస్తున్నవేళ పశ్చిమబెంగాల్ బీజేపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతు న్నాయి. రాజకీయ నాయకులతోపాటు పారిశ్రామిక వేత్తలు బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రంజన్ ముఖర్జీ కాషాయ కండువా కప్పుకున్నారు. బెంగాల్లో మార్పుకు వేళయ్యిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సేవచేసుకునేందుకు బీజేపీ తనకు అవకాశం కల్పించనట్లుగా భావిస్తున్నానని వెల్లడించారు.
‘రాష్ట్రానికి పరిశ్రమలను భారీ సంఖ్యలో తీసుకురావాల్సి ఉంది. దీనివల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అయితే ప్రస్తుతం బెంగాల్లో ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. అప్పుడే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. రాష్ట్రాన్ని తాను దేశంలోనే మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మనం కష్టపడి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.
Latest News