by సూర్య | Wed, Jan 20, 2021, 04:02 PM
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఏనుగుపై యాసిడ్ దాడి జరిగింది. నీలగిరి జిల్లాలో గాయాలతో పడి ఉన్న ఏనుగుని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. యాసిడ్ గాయాలతో బాధపడుతున్న ఏనుగును స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఏనుగుకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఏనుగుపై యాసిడ్ దాడి జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. గజరాజుపై దాడి చేసినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Latest News