by సూర్య | Wed, Jan 20, 2021, 03:59 PM
అమరావతి ఉద్యమం 400వ రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. దీంతో గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని ఉమా నిర్ణయించారు. అయితే అక్కడ దీక్షకు పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో తన నివాసంలో దీక్ష చేపట్టారు. దేవినేని దీక్షకు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 400వ రోజులకు చేరుకోవడంతో రైతులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ దీక్షలకు పిలుపు ఇచ్చిందన్నారు. రాజధాని కోసం సుమారు 117 మంది రైతులు చనిపోయారని, ఏపీ రాజధాని కోసం 34వేల ఎకరాల భూములు ఇచ్చారని, 29వేల రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News