by సూర్య | Wed, Jan 20, 2021, 02:30 PM
రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ శక్తావత్ (48) కన్నుమూశారు. గత కొంత కాలంగా లివర్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కరోనా సోకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గజేంద్రసింగ్ శక్తావత్ కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఉదయ్ పూర్ జిల్లాలోని వల్లభ్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Latest News