కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత..

by సూర్య | Wed, Jan 20, 2021, 02:30 PM

రాజ‌స్థాన్ ‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గ‌జేంద్ర ‌సింగ్ శ‌క్తావ‌త్‌ (48) కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా లివ‌ర్ ఇన్‌ ఫెక్ష‌న్ ‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ బుధ‌వారం ఉద‌యం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవ‌ల ఆయ‌నకు క‌రోనా సోకినట్లు కుటుంబ‌ స‌భ్యులు తెలిపారు. గ‌జేంద్ర‌సింగ్ శ‌క్తావ‌త్‌ కు భార్య‌, ఒక కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఉద‌య్‌ పూర్ జిల్లాలోని వ‌ల్ల‌భ్‌ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM