by సూర్య | Wed, Jan 20, 2021, 02:24 PM
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటి సెక్షన్లు ఎత్తివేయాలని ఎస్సీ రైతులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం అట్రాసిటీ సెక్షన్లు తొలగించాలని తీర్పు ఇచ్చింది. కృష్ణాయపాలెంలోని 11 మంది రైతులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
Latest News