by సూర్య | Wed, Jan 20, 2021, 11:53 AM
డీజీపీ రాజకీయ ఒత్తిడులకు లొంగి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తం ఉందని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు. డీజీపీ మాటలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఏపీలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలయ్యారని పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పోలీసులకు హెడ్ క్వార్టర్స్గా మారిందని ఎద్దేవా చేశారు.మంత్రి వెల్లంపల్లి సీబీఐని విమర్శించే స్థాయికి వెళ్ళి పోయారని ఆయనను విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కరకట్ట మీద భవనాలు కూల్చడం తప్ప జగన్కు ప్రణాళికలు లేవని ఆరోపించారు. ఏదీఏమైనా బీజేపీ రథయాత్రను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. తిరుమలలో బీజేపీ యాత్రను అడ్డుకుంటే రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని జోత్స్యం చెప్పారు. కపిలతీర్థం నుండి రామతీర్థం వరకు యాత్ర చేసి తీరుతామని, పాస్టర్ ప్రవీణ్ను పోలీసులు ఎందుకు కస్టడిలోకి తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుక వైసీపీ ప్రభుత్వం కుట్రచేస్తోందని ఆరోపించారు. జనసేన, బీజేపీ సంయుక్తంగానే యాత్ర చేపడుతోందన్నారు.
Latest News