గొల్లపూడిలో మళ్లీ ఉద్రిక్తత..

by సూర్య | Wed, Jan 20, 2021, 11:58 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 400వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపూడి సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధం కావడంతో పట్టణంలో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని దీక్షకు అనుమతి లేదని పేర్కొంటూ.. పట్టణంతోపాటు ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, గొల్లపూడిలో నిన్న కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధమయ్యారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM